ఆపస్తంబుడు , అశ్వలాయనుడు అను నిద్దరు మహామునులు బ్రాహ్మణధర్మములను సూత్రములుగా వ్రాసిరి .మొదటివాని సూత్రముల నవలంబించినవా రాపస్తమ్బసూత్రులనియు , రెండవవాని సూత్రమ్బులనవలమ్బిన్చినవారి నశ్వలాయనసూత్రులనియు జెప్పుదురు. నూజివీటి యప్పారావు వారియోద్ద ఉద్యోగము సెయునొక బ్రాహ్మణుడు ఒక యగ్రహారమునకు బోయి యుండ , నచ్చటి వైదికు లతనితో మీరాపస్తంబులా , యశ్వలాయనులా యని యడిగిరి. .జన్మ మధ్యమండా మాట లెన్నడూ విననివాడగుటచే నాతడు మే రాపస్తంబులము, నశ్వలాయనులము ,గాము, అప్పారావుగారి హర్కారాలమని వాపోయెను ( ఈ కధలు పాతకాలంలో హరికదల మధ్యలో పిట్టకధలుగా చెప్పేవారు. . )
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి